
కె24న్యూస్ తెలుగు ఆగస్టు 01. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ఈ సేవ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుపతి లక్ష్మీపతి, త్యాగారాజులు రెడ్డి, కె.బాబు రెడ్డి, రామక్రిష్ణ రెడ్డి, బి పట్టాభి రెడ్డి, ఇ.రఘునాథరెడ్డి, నరసింహ రెడ్డి, దామోదర్ రెడ్డి మరియు స్థానిక పాఠశాల విశ్రాంతి ఉపాధ్యాయులు కన్నయ్య పిళ్ళై పాల్గొని అన్నదాన వితరణ చేశారు.






