
కె24న్యూస్ తెలుగు జూలై 25. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం, యోగా, ధ్యాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. సమాజ సేవలో భాగంగా చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రమీల, కె.రామిరెడ్డి, ఇ.రఘునాథరెడ్డి, జగదీష్ రెడ్డి, నరసింహ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఆర్టీఐ-ఏఎస్ ఫౌండర్ బండి పట్టాభి రెడ్డి, స్థానిక పాఠశాల విశ్రాంతి ఉపాధ్యాయులు కన్నయ్య పిళ్ళై సతీమణి కె.వనజాక్షి మరియు పలువురు గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించారు.







