
కె24న్యూస్ తెలుగు జూలై 18. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలం మంగుంట గ్రామ పరిధిలోని శ్రీవకుళ మాత శ్రీకృష్ణ ఆశ్రమాన్ని జనసేన పార్లమెంటు పరిశీలకుల కమిటీ సభ్యులు కంజేరి చంద్రశేఖర్@చందు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్రమానికి మైక్ సెట్, 20 కుర్చీలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నిరాశ్రయులకు, పేదలైన అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్న ఈ ఆశ్రమానికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆశ్రమ కార్యనిర్వాహకులు తులసమ్మ గంగిరెడ్డి, జనసేన నేతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.మురుగన్, రమేష్, నవీన్ రెడ్డి, టీ.సుబ్రహ్మణ్యం, మార్కొండయ్య, గురుస్వామి, మురగయ్య, తేజ తదితరులు పాల్గొన్నారు.







