సబ్సిడీ పేరుతో రైతులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: సీపీఎం

 

తెలుగు కే న్యూస్
చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో మామిడి మండీలు సబ్సిడీ పేరుతో రైతులను మోసం చేశాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ఆరోపించారు. పర్మిషన్ లేకుండానే మామిడికాయలు సేకరించి, ఇప్పుడు సబ్సిడీ వర్తించదని చెప్పడం అన్యాయమన్నారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి మామిడి రైతులందరికీ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :