అనారోగ్యంతో మృతిచెందిన కుటుంబానికి సీపీఐ నేతల ఆర్థిక సాయం

మంచిర్యాల జిల్లా, జూలై 16 (తెలుగు కే న్యూస్): మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం నీలాయపల్లి గ్రామానికి చెందిన సీపీఐ గ్రామ కార్యదర్శి ఎడ్ల గోపాల్ కోడలు ఎడ్ల దేవి అనారోగ్యంతో మృతిచెందారు. ఈ సందర్భంగా సీపీఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎడ్ల దేవి చిత్రపటానికి నివాళులర్పించారు. పార్టీ తరఫున రూ.3,000 ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి నరాల ప్రహ్లాద్, చంద్రపల్లి గ్రామ కార్యదర్శి కొండ సాయికుమార్, నీలాయపల్లి సహాయ కార్యదర్శి బొంతల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :