
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాకతీయ నగర్ లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి మూడున్నర తులాల బంగారు గొలుసు 20 తులాల వెండి ఆభరణాలను దొంగలించారు. బాధితుల ఫిర్యాదుతో విషయం తెలుసుకున్న ఎస్సై రంజిత్ వెంటనే సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







