
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీకి చెందిన పండరి – స్వరూప కుటుంబం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఎంతో దయనీయ పరిస్థితుల్లో జీవిస్తోంది. ఈ పరిస్థితిని గుర్తించిన దాతలు మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం అందించారు.
– మచ్చ నాగరాజు స్వరూప గారి కోసం ఒక పరుపు (బెడ్) అందజేశారు.
– గంజి వెంకటేశం కిరాణా సామాను మరియు 3 బెడ్ షీట్లు ఇచ్చి కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా సహాయం చేసిన దాతలందరికీ శ్రీ మాత కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు.
ప్రస్తుతం ఈ కుటుంబానికి తినడానికి సరిపడా ఆహారం కూడా లేదు. ధరించడానికి బట్టలు లేని పరిస్థితి నెలకొంది. కాబట్టి మానవత్వంతో స్పందించే దాతలు ఈ నిరుపేద కుటుంబానికి తమ వంతు సహాయం అందించాలని కోరుతున్నారు
మీరు చేయగల సహాయం
బియ్యం, పప్పులు, నిత్యావసర కిరాణా సామాను
పాతవి లేదా కొత్తవి అయిన ఉపయోగకరమైన వస్త్రాలు
-బెడ్ షీట్లు, దుప్పట్లు, పరుపులు అందజేశారు.
ఆ కుటుంబం ఆకలితో బాధపడకుండా… ఒక తల్లి కన్నీళ్లు ఆరేలా… మనం కలిసి అండగా ఉంటామని అని శ్రీ మాత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.





