కామారెడ్డి లో బృందావన్ కాలనికి చెందిన పండరి – స్వరూప కుటుంబానికి దుస్తువులు అందజేసిన శ్రీమత కుటుంబ సభ్యులు

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీకి చెందిన పండరి – స్వరూప కుటుంబం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఎంతో దయనీయ పరిస్థితుల్లో జీవిస్తోంది. ఈ పరిస్థితిని గుర్తించిన దాతలు మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం అందించారు.

– మచ్చ నాగరాజు స్వరూప గారి కోసం ఒక పరుపు (బెడ్) అందజేశారు.
– గంజి వెంకటేశం కిరాణా సామాను మరియు 3 బెడ్ షీట్లు ఇచ్చి కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా సహాయం చేసిన దాతలందరికీ శ్రీ మాత కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు.

ప్రస్తుతం ఈ కుటుంబానికి తినడానికి సరిపడా ఆహారం కూడా లేదు. ధరించడానికి బట్టలు లేని పరిస్థితి నెలకొంది. కాబట్టి మానవత్వంతో స్పందించే దాతలు ఈ నిరుపేద కుటుంబానికి తమ వంతు సహాయం అందించాలని కోరుతున్నారు

మీరు చేయగల సహాయం
బియ్యం, పప్పులు, నిత్యావసర కిరాణా సామాను
పాతవి లేదా కొత్తవి అయిన ఉపయోగకరమైన వస్త్రాలు
-బెడ్ షీట్లు, దుప్పట్లు, పరుపులు అందజేశారు.
ఆ కుటుంబం ఆకలితో బాధపడకుండా… ఒక తల్లి కన్నీళ్లు ఆరేలా… మనం కలిసి అండగా ఉంటామని అని శ్రీ మాత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :