కె 24తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. బీజేపీ ధర్నా

నిజామాబాద్ జిల్లా,నవీపేట్, జూలై 24: ప్రధానమంత్రి నివాస ముట్టడి ప్రయత్నాన్ని ఖండిస్తూ నవీపేట్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ద్యాగ సరీన్ మాట్లాడుతూ దేశ గౌరవం, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే చర్యలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ సర్పంచులు గంగాధర్ రాజు, ఉపసర్పంచ్ సందీప్, జిల్లా నాయకుడు శ్రీనివాస్ గౌడ్, పిల్లి శ్రీకాంత్, మైసా రాధ, ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్, మోర్చా అధ్యక్షులు మోస్రా గోపాల్, బండారి రాజశేఖర్, వార్డు సభ్యులు నవీన్, ప్రేమ్ సింగ్, సీనియర్ నాయకులు గణేష్, ఆనంద్, ప్రవీణ్, యోగేష్, కృష్ణ, నర్సింలు, రమేష్తో పాటు బీజేపీ కార్యకర్తలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని ముగించారుzm.