టాస్క్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బహుమతుల ప్రధానం టాస్క్ జిల్లా కన్వీనర్ డాక్టర్ బాలు

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం(టాస్క్) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు టాస్క్ రాష్ట్ర అధ్యక్షులు ఆరోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా విజన్ జూనియర్ కళాశాల మరియు సాందీపని డిగ్రీ కళాశాలల విద్యార్థులు సిరి చందన,ఫర్హానా బేగం,జీవిత,శ్రీలేఖ బహుమతులను సీనియర్ జర్నలిస్ట్ మరియు ఎడిటర్ అల్లం నారాయణ,ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి రవీందర్ యాదవ్ లు అందజేయడం జరిగిందని టాస్క్ జిల్లా కన్వీనర్ డాక్టర్ బాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టాస్క్ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ వేద ప్రకాష్,అంబేద్కర్ యూనివర్సిటీ సహాయ ఆచార్యులు పడాల లక్ష్మణ్, నరేందర్ గౌడ్,రవీందర్ లు పాల్గొనడం జరిగింది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :