
K24న్యూస్ సిద్దిపేట జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను ఖండిస్తున్నట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి, పార్లమెంట్ ఇంచార్జ్ పంగ బాబు, జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.







