
శేరిలింగంపల్లి తెలుగు కె న్యూస్.. కొండాపూర్ డివిజన్ పరిధిలోనీ శ్రీ రామ్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ అద్వర్యంలో ఆదివారం రోజు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీని కలిసి అమ్మవారి గుడి నిర్మాణం గురించి మరియు వాటర్ సమస్య గురించి వివరించడం జరిగింది. వారు వెంటనే వాటర్ వర్క్స్ మేనేజర్ సందీప్ తో మాట్లాడి రోజు మార్నింగ్ టైం లో నీటి విడుదల చేయాలని అలాగే కొద్దిగా సమయం పెంచాలని చెప్పడం జరిగింది. అమ్మవారి గుడి గురించి ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పారు కాలనీ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున రావడం జరిగింది వారికి పేరుపేరునా బలరామ్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.







