
మంచిర్యాల జిల్లా తెలుగు కె న్యూస్ మందమర్రిలోని లెదర్ ఇండస్ట్రీస్ పార్క్ను తెలంగాణ లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TLIPCL) ఎండీ ప్రశాంత్ కుమార్ గురువారం అనధికారికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు లెదర్ పార్క్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు.ఈ పర్యటన అనధికారికమైనందున పాత్రికేయులు, లెదర్ పార్క్ శిక్షణ పొందిన యువత, ప్రజా ప్రతినిధులు తదితరులకు సమాచారం ఇవ్వలేకపోయామని తెలంగాణ లెదర్ పార్క్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలుగూరి విజయ్ కుమార్ తెలిపారు. త్వరలో అధికారిక పర్యటన నిర్వహించి అందరికీ సమాచారం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.





