రికార్డు స్థాయిలో 5075 మొబైల్ ఫోన్ల రికవరీ: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి జిల్లా, K24 న్యూస్ తెలుగు:
కామారెడ్డి జిల్లా పోలీసులు CEIR పోర్టల్ సహాయంతో రూ.8.12 కోట్ల విలువైన 5,075 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. గత నెలలో రూ.21.76 లక్షల విలువైన 136 ఫోన్లు, ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.27 కోట్ల విలువైన 794 ఫోన్లను బాధితులకు అప్పగించారు. సెల్‌ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి CEIR పోర్టల్‌లో IMEIని బ్లాక్ చేయాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. రికవరీ అయిన ఫోన్ల కోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఐ బాల్‌రాజ్‌ను 8712686114లో సంప్రదించాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :