
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, ఆగస్టు 01, తెలుగు కె న్యూస్ ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో
సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ లు మాట్లాడుతూ, మధ్యాహ్నం భోజనం కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని కార్మికులందరికీ గ్యాస్ సరఫరా చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికులకు వంట గదులను నిర్మించే ఇవ్వాలి, మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కల్పించాలి, ప్రమాదం ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సిఐటి ఆర్మూర్ మండలం కుతాడి ఎల్లయ్య కొండగంగాధర్,మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆర్మూర్ మండల కార్యదర్శి జె.సుజాత, జయ, సుజాత, శంకర్,భవిత, దేవయి, బజమ్మ, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.





