
హైదరాబాద్, తెలుగు కే న్యూస్ జూలై 27: హైడ్రా కమిషనర్ రంగనాథ్ను పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో తగిన అర్హత కలిగిన అధికారిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన పలు కేసులను విచారించిన సందర్భంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.






