
జూన్ 24 :చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు పిఎం శ్రీ నిధులతో ఆర్వో వాటర్ ప్లాంట్ 3,48,000/- రూపాయలతో మంజూరు కావడం జరిగింది. ఈ ఆర్వో ప్లాంట్ ను ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలందరూ ప్యూరిఫైడ్ వాటర్ ని తాగి ఆరోగ్యవంతంగా మంచిగా చదువుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశమని . తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ,సిఆర్పి పాల్గొనడం జరిగింది.






