రామకృష్ణ కాలనీ ఎం జె పి హాస్టల్‌లో అధ్వాన్న వసతులు

450 మంది విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువు.. విషకీటకాల భయంతో విద్యార్థులు

తిమ్మాపూర్, ఆగస్టు 20 (తెలుగు కే న్యూస్): తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ఎంజేపీ హాస్‌లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో దాదాపు 450 మంది విద్యార్థులు ఉంటున్నారు. అలాగే బాత్రూమ్‌లకు తలుపులు సరిగా లేకపోవడం, 450 మంది విద్యార్థులకు సరిపడా బాత్రూమ్‌లు, నీటి నల్లా కనెక్షన్లు లేకపోవడం దయనీయ పరిస్థితులకు అద్దం పడుతుందని తల్లిదండ్రులు అంటున్నారు.హాస్టల్‌లోని పలు ప్రాంతాల్లో నీటి లీకేజీల కారణంగా నీటి గుంతలు ఏర్పడి, దోమలు, ఇతర కీటకాలు పెరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో కొంత మంది విద్యార్థులు జ్వరాలు, చర్మ సంబంధిత అలర్జీలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.విద్యార్థులు చెబుతున్న సమస్యలను హాస్టల్ ప్రిన్సిపల్ కూడా ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశం ప్రభుత్వం, సంబంధిత అధికారులు హాస్టల్‌ను పరిశీలించి ప్రహరీ గోడ నిర్మాణం, బాత్రూమ్‌లు, నీటి వసతి గృహాలు, లీకేజీల మరమ్మతులు తదితర సమస్యలను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.