రామకుప్పం దళిత భూ వివాదం: అధికారుల తీరుపై భగ్గుమన్న దళిత సంఘాలు!

 

కె24న్యూస్ తెలుగు జూన్ 27. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ముదారం గ్రామంలోని సర్వే నంబర్లు 390/1, 390/2, 390/7 భూముల విషయంలో స్థానిక దళిత కుటుంబాలకు జరిగిన అన్యాయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న దళితుల హక్కులను విస్మరించి, గుడిపల్లి మండలానికి చెందిన వ్యక్తులకు పట్టాలివ్వడంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. అధికారుల అధికార దర్పం, పక్షపాత వైఖరిని ఖండిస్తూ, ఈ అక్రమ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని, బాధిత మాదిగ కుటుంబాలకు న్యాయం చేయాలని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు తాము వెనకడుగు వేసేది లేదని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :