నిజామాబాద్ జిల్లా,డొంకేశ్వర్ మండల కేంద్రంలో:- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శుభారంభ సూచకంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల బాపూరావు ఆధ్వర్యంలో, ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో లబ్ధిదారురాలు కండెల సుమలత ఇంటి వద్ద ముగ్గు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దడిగ సాయన్న, లిఫ్ట్ చైర్మన్ నర్సారెడ్డి, భూమేష్ రెడ్డి, కనకాపురం అశోక్, జంగల, మెంబర్లు నరేష్, సురేష్, సాయన్న, వంశీ రెడ్డి, బార్ల రవీందర్, శోభన్, అమీర్తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం జై కాంగ్రెస్ నినాదాలతో ఉత్సాహంగా సాగింది.