ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ తేజస్విని గన్నేరువరం మండలంలో పర్యటన

తెలుగు K24 న్యూస్ | గన్నేరువరం | జూన్ 29
శిక్షణలో భాగంగా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ కుమారి జిన్నా తేజస్విని సోమవారం గన్నేరువరం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, ఎంపీడీవో కార్యాలయ విధుల నిర్వహణపై అవగాహన పొందారు.
అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్), హెల్త్ సబ్ సెంటర్‌ను తనిఖీ చేసి, అక్కడి నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ సురేందర్, ఏఈ (పీఆర్) సురేందర్, హౌసింగ్ ఏఈ మహేందర్, ఎంఈవో రామయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :