అయ్యప్ప సొసైటీలో శ్రీ వేంకటేశ్వరస్వామి నూతన ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా ప్రారంభం

తెలుగు K24 న్యూస్ | జూన్ 30
అయ్యప్ప సొసైటీలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు మంగళవారం (జూన్ 30) నుంచి జూలై 3వ తేదీ (శుక్రవారం) వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఈ మహోత్సవాలు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ మన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
నాలుగు రోజుల పాటు ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం, యాగాలు, ప్రత్యేక హోమాలు, వేదపారాయణాలు, నిత్యారాధనలు, విశేష పూజలు పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జూలై 3వ తేదీ (శుక్రవారం) ఉదయం 7:12 గంటలకు, సమాన నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ శుభముహూర్తంలో వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవారు, శ్రీ గోదాదేవి అమ్మవారు, శ్రీ అభయాంజనేయస్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు.
ఈ దివ్య మహోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీర్వాదాలు పొందాలని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
గోవిందా… గోవిందా…! శ్రీ వేంకటేశ్వర వారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ… ఈ పవిత్ర మహోత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొనండి.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.