

డప్పు వాయిద్యాల నడుమ పురుషులు కోళ్లు, మేకలతో ఊరేగింపుగా వెళ్లగా, మహిళలు, యువతులు బోనాలు ఎత్తుకుని సంప్రదాయ నృత్యాలతో వేడుకలో పాల్గొన్నారు. అమ్మవారికి గుగ్గిళ్లు (ఘుగ్రీ), లాప్సీ (పాయసం) నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోళ్లు, మేకలను బలిచ్చి వాటి పైనుంచి పశువులను దాటించారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని లంబాడీలు విశ్వసిస్తారు.
పెద్దమనిషి పూజారిగా వ్యవహరించి సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యుడు మెగావత్ ప్రేమ్ సింగ్, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు తండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






