

కె24న్యూస్ తెలుగు జూలై 30. కుప్పం నియోజకవర్గం మల్లానూరు గ్రామంలో ప్రజా చెరువు ఆక్రమణను ప్రశ్నించిన బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని కలిసి ఈ ఘటనపై వినతిపత్రం సమర్పించారు. చెరువును కాపాడాలని నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎం.పీ. ప్రకాష్ డిమాండ్ చేశారు.





