
కె24న్యూస్ తెలుగు ఆగష్టు 15. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం అగరమంగళం గ్రామ సచివాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్ ప్రియా, వెల్ఫేర్ అసిస్టెంట్ కిషోర్ కుమార్,విఆర్ఓ సాధు సుందర్, ఇంజనీర్ భరత్ కుమార్, మహిళా పోలీస్ స్వాతి మరియు ఏఎన్ఎమ్ సరిత ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు జి ఆనందబాబు జై హింద్ నినాదాలతో దేశభక్తిని చాటుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు టీడీపీ పురుషోత్తమ నాయుడు, వెంకటేశులు మరియు మునిరత్నం నాయుడు పలువురు నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.






