

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 15. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని మసీద్ కాంప్లెక్స్ వద్ద మైనారిటీ సోదరులు, ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులను స్మరించుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో ఎందరో మహనీయుల పోరాటాలు కారణమని నాయకులు కొనియాడారు. రాజ్యాంగం అందించిన సమానత్వం, సామాజిక న్యాయం ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MRPS కుప్పం నియోజకవర్గ కో-ఇంచార్జ్ పి.వెంకటేష్, MSP గోవిందప్ప మాదిగ, నాసిర్ భాష, వాజీద్ భాషా, మన్సుర్ భాషా, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.






