
కె24న్యూస్ తెలుగు ఆగష్టు 20. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండల ఎంపీడీవో మనోహర్ గౌడ్ ను ఆర్టీఐ అవేర్నెస్ సొసైటీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీఐ అవేర్నెస్ సొసైటీ ఫౌండర్ బండి పట్టాభిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఎంపీడీవో ప్రశంసాపత్రం అందుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డీకే కుమార్, బోర్డు డైరెక్టర్స్ పుష్పరాజ్, శ్రీనివాసులు రెడ్డి, లోఖానాధం నాయుడు, డీకే మోహన్ రావ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






