

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 15. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండల కేంద్రంలోని ఆర్టీఐ-ఏఎస్ జాతీయ ఉపకార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ సీఈఓ జ్యోతిప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీఐ అవేర్నెస్ సొసైటీ ఫౌండర్ బండి పట్టాభిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ-ఏఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మోహన్ కుమార్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ DK కుమార్, బోర్డు చైర్మన్ SH రాంప్రకాష్, బోర్డు డైరెక్టర్ గిరి బాబు, పుష్పరాజ్, స్టిఫెన్, శ్రీనివాసులు రెడ్ది, శ్రీనివాసులు, పట్టాభి, DK మోహన్ రావ్, డాక్టర్ బాలు, లోఖానాధం నాయుడు, మండల అధ్యక్షులు పురుషోత్తం మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




