కొండమల్లేపల్లిలో ఇంటింటికి మొక్కల పంపిణీ

కొండమల్లేపల్లి: తెలుగు కే న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ప్రతి ఇంటికి రెండు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. మొక్కలను నాటి సంరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ పసునూరు యుగంధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి డాకు నాయక్, ఉపసర్పంచ్ భర్త వెంకటయ్య, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :