
K24 న్యూస్ తెలుగు కొండమల్లేపల్లి పట్టణంలో దోమల బెడద పెరిగిందని, వెంటనే ఫాగింగ్, బ్లీచింగ్ చేపట్టి పారిశుద్ధ్య చర్యలు అమలు చేయాలని వార్డు సభ్యులు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. గత రెండు నెలలుగా వీధి లైట్లు వెలగకపోవడం, వర్షాకాలంలో దోమలు అధికమవడంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎలిమినేటి సాయి, బొడిగే శంకర్ గౌడ్, బూడిద మంజుల, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.







