
కొండమల్లేపల్లి, ఆగస్టు 12: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి పట్టణంలోని జేబీ కాలనీలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా నివాసం ఉంటున్న నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్యకు గురైనట్లు సమాచారం.రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా, ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.




