
తెలుగు కే న్యూస్ కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ల్యాప్టాప్, సీసీటీవీ మానిటర్, మూడు మొబైల్ ఫోన్లు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కొమురవెల్లి, మెదక్ జిల్లా కుల్చారం, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అభినందించారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సముదాయాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.


