
తెలుగు కే న్యూస్ (జూన్ 29): గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శివాలయం నిర్మాణానికి భక్తులు ఉదారంగా విరాళాలు అందజేశారు. చిట్కూరి అనంతరెడ్డి రూ.50,116, బద్దం రాజేశ్వర్ రెడ్డి రూ.36,000, ఏలేటి చంద్రారెడ్డి రూ.21,116, బద్దం వెంకటరెడ్డి రూ.20,116, కాసింపేట సర్పంచ్ కర్నె చంద్రయ్య రూ.10,116 విరాళంగా అందించారు. ఆలయ కమిటీ సభ్యులు దాతలను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.


