
కరీంనగర్ k24 న్యూస్ తెలుగు
ఉజ్వల పార్క్లో ఉన్న మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు విగ్రహానికి తెలంగాణ రక్షణ సేన నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.
పీవీ దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసి భారత అభివృద్ధికి విశేష కృషి చేశారని, ఆయన జయంతి సందర్భంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు విగ్రహానికి నివాళులర్పించకపోవడం బాధాకరమని అన్నారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన నాయకులు విగ్రహాన్ని శుభ్రపరిచి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నూతి చరణ్, ఉమార్, సుత్రాల రాజన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


