పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నిజామాబాదు :k24 న్యూస్ తెలుగు

(ప్రస్తుతం నిజామాబాద్) – ఆర్సపల్లి,ఐ టీ ఐ 1993–1995 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో స్నేహితుల దినోత్సవం రోజున కలుసుకున్నారు.
చాలా సంవత్సరాల తరువాత ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఈ ఆత్మీయ సమ్మేళనానికి మా గురువు అశోక్ కుమార్ సర్ సాన్నిధ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి ఆశీస్సులు, మార్గదర్శక మాటలు ఈ కార్యక్రమానికి మరింత విలువను చేకూర్చాయని ఆనందాన్ని వ్యక్తం చేసారు.

31 సంవత్సరాలకు స్నేహితుల దినోత్సవం రోజైన ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ పాత జ్ఞాపకాలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని స్నేహితులందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఆత్మీయ కలయిక అందరి హృదయాల్లో చిరస్మరణీయమైన మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
ఈ ఆత్మీయ కలయిక జె. ఆంజనేయులు ఈరోజు అందరం ఒకే వేదికపై కలవడానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో అంజనేయులు, రాజు, నరోత్తమ్, నందకిషోర్ పవార్, హరిప్రసాద్ అక్కల్దేవి, సంతోష్ కుమార్, డొండి మధు, శామ్యూల్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :