
కోహెడ మండల కార్యవర్గ సమావేశానికి హాజరుకానున్న జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్
సిద్దిపేట జిల్లా, తెలుగు కే న్యూస్ ఆగస్టు 11:
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగాళ్లపల్లి కిష్టాస్వామి గుట్టపై బీజేపీ జిల్లా, మండల కమిటీ పదాధికారులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంతో పాటు బీజేపీ కోహెడ మండల కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ హాజరుకానున్నారు. విశిష్ట అతిథులుగా రాష్ట్ర, పార్లమెంట్, అసెంబ్లీ స్థాయి నాయకులతో పాటు జిల్లా నాయకులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొననున్నారు.ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతం, మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.కావున పత్రికా, మీడియా మిత్రులు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కార్యక్రమానికి హాజరై ప్రెస్ కవరేజ్ ఇవ్వాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం కోరారు.




