
సిద్దిపేట పోలీస్ శాఖ k24 న్యూస్ తెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మన పోలీస్ – మన ఊరు” కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ సోమవారం మీరుదొడ్డి మండలంలోని గుడికందుల గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 10 సీసీటీవీ కెమెరాలు, గ్రామ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గ్రామ యువతతో కలిసి నిర్వహించిన వాలీబాల్ మ్యాచ్ను ప్రారంభించిన సీపీ, రోడ్డు భద్రత, డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, డ్రంక్ అండ్ డ్రైవ్కు దూరంగా ఉండాలని తెలిపారు.
గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముగ్గుల పోటీల విజేతలు, వాలీబాల్ క్రీడాకారులకు హెల్మెట్లను బహుమతిగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్, సీఐ రాజేష్, ఎస్ఐ సతీష్, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు


