
K24 న్యూస్ గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన చింతల శ్రీధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెండోసారి నియమించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి తనపై విశ్వాసం ఉంచిన పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే తన నియామకానికి సహకరించిన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


