రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28వ తేదిన పల్స్ పోలియో కార్యక్రమం

కె24న్యూస్ తెలుగు జూన్ 24. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ఐదేళ్లలోపు వయసున్న 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 29,873 పోలియో కేంద్రాలు, 1,144 ప్రత్యేక కేంద్రాలు, 1,757 ప్రత్యేక బృందాలు, 1.31 లక్షల మందికి సిబ్బందిని సిద్ధం చేశారు. 68.67 లక్షల వ్యాక్సిన్ మోతాదులను ఇప్పటికే జిల్లాలకు పంపిణీ చేశామని వైద్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :