మద్దేపల్లి తండాలో పల్స్ పోలియో కార్యక్రమం ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య సిబ్బంది

మద్దేపల్లి తండాలో పల్స్ పోలియో కార్యక్రమం ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య సిబ్బంది నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-మద్దేపల్లి తండాలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రానికి చిన్నారులను తల్లిదండ్రులు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :