చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి: k24news తెలుగు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన ఆయన, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లాలోని అన్ని పల్స్ పోలియో కేంద్రాల ద్వారా అర్హులైన చిన్నారులందరికీ చుక్కలు వేయాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :