
కామారెడ్డి జిల్లా | తెలుగు K24 న్యూస్:
నిజాంసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జునను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు నోడల్ అధికారి షేక్ సలాంకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలను రాజకీయ వేదికలుగా ఉపయోగించడం సరికాదని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చరణ్, అల్తాఫ్, కౌశిక్, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.

