
ఉమ్మడి నల్గొండ బ్యూరో, జూలై 2 (తెలుగు కే న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం గోపాలమిత్రులకు జూలై 1నే జూన్ నెల వేతనాలు విడుదల చేయడంతో గోపాలమిత్రుల అసోసియేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తదితర ప్రజాప్రతినిధుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా గోపాలమిత్రులకు కనీస వేతనం రూ.26 వేలు, రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల ప్రమాద బీమా, విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కావటి యాదగిరి, చెరుకు శ్రీనివాస్, నూక మల్లేష్తో పాటు ఉమ్మడి జిల్లా నాయకులు, గోపాలమిత్రులు పాల్గొన్నారు.

