

ప్రజలచే ఎన్నికైన వార్డు సభ్యురాలు స్వయంగా సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా, ఆమె స్థానంలో వేరొకరు పాల్గొనడం గ్రామపంచాయతీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి, సంబంధిత మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే వార్డు సభ్యురాలు సాహిదా బేగంపై కూడా చట్టప్రకారం సభ్యత్వం రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలని బీజేపీ మండల శాఖ అధికారులను కోరింది.
ఈ కార్యక్రమంలో మైసరాద రాజేందర్ గౌడ్, నీరడి భూషణ్, సుంకరి రాజు, శ్రీనివాస్ గౌడ్, గణేష్, బండారి రాజశేఖర్, బునాది నవీన్, ప్రేమ్ సింగ్, గంగోని రాము, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

