

సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నిండి, పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కష్టాలు తొలగాలని గ్రామస్థులు సామూహికంగా ప్రార్థించారు. కలశాలతో మహిళలు నిర్వహించిన శోభాయాత్ర గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.
“రైతన్న పొలాల్లో పచ్చదనం వెల్లివిరియాలని… ప్రకృతి కరుణతో మంచి వర్షాలు కురవాలని మద్దేపల్లి గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.”

