
కామారెడ్డి జిల్లా, తాడ్వాయి (K24 న్యూస్): తాడ్వాయి మండలంలో నూతన బీజేపీ కార్యాలయాన్ని రాష్ట్ర నాయకులు బాణాల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఏ-2లకు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేసి, సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





