ఆర్‌పీఐ జిల్లా సదస్సులో సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తామని ప్రకటన

కరీంనగర్, జూన్ 30 (తెలుగు K24 న్యూస్): రాష్ట్రంలో సామాజిక న్యాయం కరువైందని, కుల వివక్షకు గురవుతున్న వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ డిమాండ్ చేశారు.
కరీంనగర్‌లో నిర్వహించిన ఆర్‌పీఐ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, మహిళల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజయ్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మొగురం మీరియా, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కారుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :