కామారెడ్డి రాజీవ్ నగర్ కాలనీలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి రాజీవ్ నగర్ కాలనీలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆటోలకు, బైకులకు, తప్పనిసరిగా సరైన పత్రాలు ఉండాలని జిల్లా ఎస్పీ కోరారు. కామారెడ్డి రాజీవ్ నగర్ కాలనీలో సరైన పత్రాలు లేని సుమారు 95 బైకులు,15 ఆటోలను పోలీసులు గుర్తించారు. కార్డెన్ సెర్చ్ ద్వారా నేరాలకు పాల్పడే అనుమానిత వ్యక్తులను, వాహనాలను గుర్తించనునట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సెర్చ్ లో కామారెడ్డి సబ్ డివిజనల్ డిఎస్పి మధుసూదన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :