
కామారెడ్డి జిల్లా : తెలుగు K24 న్యూస్ :
కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 10.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. సంబల్పూర్–పూణే సాంగవళి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న అశోక్ కుమార్ మిశ్రా, గణేష్ పండిత్లను అదుపులోకి తీసుకుని, గంజాయిని రాయగఢ్ (ఒడిశా) నుంచి నాందేడ్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.

