
మంచిర్యాల, జూన్ 22 (తెలుగు కే న్యూస్): జైపూర్ మండల కేంద్రంలో రూ.25 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న నూతన కమ్యూనిటీ భవనానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సోమవారం భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సామాజిక, సాంస్కృతిక అవసరాల కోసం కమ్యూనిటీ భవనాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

