
కామారెడ్డి జిల్లా, బిక్కనూరు: రామేశ్వర్పల్లి గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, గ్రామ యువకులు కలిపి 40 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ, రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, తలసేమియా చిన్నారులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. శిబిరం విజయవంతానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, వైద్యులు, నిర్వాహకులను ఆయన అభినందించారు.


